కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అప్పీళ్ల దాఖలు గడువును ఒక నెల పాటు పొడిగించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూన్ 30తో ముగియాల్సిన గడువు పోర్టల్పై పెరిగిన ఒత్తిడి, సాంకేతిక సమస్యల నేపథ్యంలో పొడిగించబడింది. రోజుకు దాదాపు 5,000 అప్పీళ్లు దాఖలవుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్పీళ్లు దాఖలు చేసుకోవాలని సూచించారు.