ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 'ఈ రాత్రికే ఇరాన్ నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం' అని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రంప్ను పదవి నుంచి తొలగించాలని 70 మందికి పైగా చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించి, క్యాబినెట్ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని, కాంగ్రెస్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.