IPLలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు RCB చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన నితీష్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ధోనిపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ధోని అభిమానులు అతడిని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఈ వైఫల్యం జట్టు ఓటమికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.