ధురంధర్‌-2 ఓటీటీ విడుదల వాయిదా!

6860చూసినవారు
ధురంధర్‌-2 ఓటీటీ విడుదల వాయిదా!
'ధురంధర్‌-2' చిత్రం ఓటీటీ విడుదలపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద రూ. 1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, అనుకున్న తేదీ కంటే ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు రానుంది. సాధారణంగా 8 వారాల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదలయ్యే ఈ చిత్రం, మార్చి 19న విడుదలైంది. మే 20లోపు విడుదల కావాల్సి ఉండగా ఐపీఎల్ కారణంగా జూన్ మొదటి వారానికి వాయిదా పడినట్లు సమాచారం. ఐపీఎల్ ఉత్కంఠ నేపథ్యంలో, క్రికెట్ సందడి వీక్షకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించి, నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్