మధుమేహం నియంత్రణలో ఆహారంతో పాటు భోజనం చేసే సమయం కూడా చాలా కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరం సహజ జీవ గడియారానికి అనుగుణంగా నిర్ణీత సమయాల్లో భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించవచ్చని తెలిపారు. రోజూ ఒకే సమయానికి భోజనం చేయడం, ఉదయం అల్పాహారాన్ని ఆలస్యం చేయకపోవడం, ప్రధాన భోజనాల మధ్య తగిన విరామం పాటించడం, రాత్రి భోజనాన్ని నిద్రకు రెండు నుంచి మూడు గంటల ముందే ముగించడం వంటి అలవాట్లు ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.