కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కేశఖండనం వద్ద ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులతో కిక్కిరిసిన కొండపై ఈ ఘటన జరగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నాసిరకం పనులే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.