దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయి 72,582 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 22,530 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.93.59కి పడిపోయింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి షేర్లు నష్టపోగా, హిండాల్కో, ఓఎన్జీసీ లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ రంగాల మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.