దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇరాన్-అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, అంతర్జాతీయంగా చమురు ధరలు అమాంతం పడిపోవడంతో సూచీలు నేడు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 2600 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ మళ్లీ 23,500 మార్క్ దాటి ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. రూపాయి విలువ కోలుకుంది. నేటి ట్రేడింగ్లో 50 పైసలు పెరిగి 92.56 వద్ద ట్రేడవుతోంది.