దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరగా, సెన్సెక్స్ 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 99.05, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. గత సెషన్లో యూఎస్ ఎస్&పీ 2.51 శాతం, నాస్డాక్ 2.8 శాతం పెరిగాయి.