AP: మచిలీపట్నం-మంగినపూడి బీచ్ను ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి సందర్శించారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక అధికారిగా ఆమ్రపాలి నియమితులయ్యారు. బీచ్ వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను ఆమె పరిశీలించారు. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో బీచ్ వద్దకు ఎవరినీ అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. పోలీసులు, మెరైన్ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సూచించారు.