మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రింక్లోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని చేస్తాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నర్హరి జిర్వాల్, ఎనర్జీ డ్రింక్స్తో కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్లో కెఫీన్, చక్కెర అధికంగా ఉంటాయి.