ఒమన్ తీరంలోని నౌకలపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు అమెరికానే కారణమనే వార్తల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. యూఎస్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని
అమెరికా ఎంబసీ పలు ఆటోలపై ట్రంప్, యూఎస్ జెండాల పోస్టర్లను వేసింది. అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఆటో డ్రైవర్లు వాహనాలను అడ్డుకుని, పోస్టర్లను చింపివేశారు.