AP: డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది. ఈ నెల 28న ఉ.9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాల్ లెటర్లలోని సూచనలను కచ్ఛితంగా పాటించాలన్నారు. అలాగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.