AP:
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి టౌన్హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్మెంట్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.