ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2026లో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీని ద్వారా సుమారు 2,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారట. అలాగే డీఎస్సీ పరీక్షలు మార్చి 2026లో నిర్వహించే యోచనలో ఉన్నట్లు టాక్. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.