నందినీ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రంలో సమంత నటిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సోమవారం నుంచి డబ్బింగ్ పనులు మొదలయ్యాయని మేకర్స్ తెలిపారు. సమంత తన ఇన్స్టాగ్రామ్లో డబ్బింగ్ చెబుతున్న ఫోటోను షేర్ చేస్తూ, తన ఫేవరెట్ మూవీ కోసం పనిచేస్తున్నానని పేర్కొన్నారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.