AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3, 2026 నుండి వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే భక్తులు సైతం తప్పనిసరిగా దర్శనం టికెట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఆదాయాన్ని, నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. సిఫారసు లేఖలతో వచ్చే ప్రతి ఒక్కరూ టికెట్ కొనాల్సిందేనని స్పష్టం చేశారు.