ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. వేగంగా వచ్చిన ఒక జీపు ఈ-రిక్షాను ఢీకొట్టింది. డ్రైవర్ అడ్డుకోగా, నిందితుడు కావాలనే అతడిని మళ్ళీ ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు జీపు బానెట్పై పడగా, డ్రైవర్ ఏమాత్రం ఆపకుండా అలాగే కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అక్కడ ఉన్నవారు దీన్ని వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.