రాయవరం శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్లో జరిగిన ఘోర ప్రమాదంలో అనపర్తికి చెందిన మహిళా కార్మికురాలు చికిత్స పొందుతూ మరణించారు. ఈ దుర్ఘటనపై అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఐదు రోజుల్లో నష్టపరిహారం అందకపోతే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.