రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామంలో దసరా సందర్భంగా ఆదివారం కుంకుమ పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి కరుణ, కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.