కోనసీమ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అమలాపురం కలెక్టరేట్ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం, మలికిపురం మండలంలో అత్యధికంగా 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆలమూరు మండలంలో అత్యల్పంగా 1 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 0.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.