అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో సుమారు రూ. 98 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి, రూ. 15 లక్షలతో బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక సొసైటీ వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.