దేవరపల్లిలో గురువారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నుంచి కాకినాడకు ఐసర్ వ్యాన్ లో తరలిస్తుండగా ఈ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. వ్యాన్ ను సీజ్ చేసి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.