దేవరపల్లి మండలం గౌరీపట్నం పరిధిలోని కొండగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని గుర్తుతెలియని కారు బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన యువకులు సోలార్ సిస్టమ్లో పనిచేస్తున్నట్లు తెలిసింది.