ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో 'రైతన్నా.. మీ కోసం' వర్క్ షాప్లో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కార్యకర్తల సమావేశంలో పాల్గొని, సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.