బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం శివారులోని జాతీయ రహదారిపై పొగ కమ్మేసింది. సమీపంలోని పొలంలో రైతు ఎండు గడ్డికి నిప్పు పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు ఇబ్బందులు పడటమే కాకుండా, మంటల వేడికి ద్విచక్ర వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని భయభ్రాంతులకు గురయ్యారు.