డిసెంబర్ 3న నల్లజర్లలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నేపథ్యంలో, సోమవారం నల్లజర్లలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని ఆమె సూచించారు.