గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం రాజమండ్రి కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై కలెక్టర్తో చర్చించారు. అభివృద్ధి పనులకు నిధులు త్వరగా మంజూరు చేసి, వాటిని వేగంగా పూర్తి చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.