గోకవరం: యువకుడి మృతదేహం లభ్యం

4చూసినవారు
గోకవరం: యువకుడి మృతదేహం లభ్యం
గోకవరం మండలం బావాజీపేట గ్రామానికి చెందిన దుల్ల చరణ్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. నిన్న సాయంత్రం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈరోజు అతని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రికి తరలించినట్లు ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు.