కాకినాడ జిల్లాలో కబ్జాకు గురైన నీటి వనరులను సంరక్షించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివిధ శాఖలకు చెందిన జల వనరులపై ఆక్రమణలను సమిష్టిగా తొలగించాలని సూచించారు. అధికారులు నిరంతర నిఘా ఉంచాలని ఆయన తెలిపారు.