
బెంగాల్, పుదుచ్చరిల్లో అత్యధికంగా ఓట్లు వేసిన ట్రాన్స్జెండర్లు
తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లు (థార్డ్ జెండర్) భారీ సంఖ్యలో ఓటు వేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం, పశ్చిమ బెంగాల్లో 91.28 శాతం, పుదుచ్చెరిలో 91.81 శాతం మంది ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో 60.49%, అస్సాంలో 36.84%, కేరళలో 57.04% ఓటింగ్ నమోదైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో థార్డ్ జెండర్ కేటగిరీలో నమోదైన వారిలో సుమారు 27% మంది ఓటు వేశారు.




