కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా సంగాని సచ్చిదానంద వర్మ నియమితులు కానున్నారు. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)లో ఫైనాన్స్ విభాగం అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న వర్మ, నవంబర్ 10వ తేదీ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకాలం కేటీ సుధాకర్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా వ్యవహరించారు.