కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ట్రాఫిక్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ట్రాఫిక్-1 & 2 స్టేషన్ల సిబ్బందికి హెల్మెట్లను అందజేయడంతో పాటు, ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు.