కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆదివారం రావులపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈతకోటలో రూ. 2.90 కోట్లతో గోరింకల డ్రెయిన్పై వంతెన నిర్మాణానికి, రావులపాడులో ఉపాధి హామీ నిధులు రూ. 65 లక్షలతో నిర్మించిన సి.సి. మరియు మెటల్ రోడ్లను ఆయన ప్రారంభించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లి మంగాదేవి భీమారావు, గుబ్బల శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.