శనివారం కోనసీమలోని తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం కల్పించారు. రాత్రి సుమారు 9 గంటల వరకూ భక్తులు నిర్వహించిన వివిధ సేవలతో స్వామివారికి రూ. 56, 59, 925 ఆదాయం సమకూరింది.