ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ భక్తుల తాకిడితో, ఆలయానికి రూ. 9.75 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. భక్తులు వివిధ సేవలు నిర్వహించారు.