ఐ. పోలవరం మండలం ఐ. పోలవరంలో కోడూరి వెంకటేష్ (33) అనే యువ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ సోమవారం విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. స్థానికులు అతన్ని టి. కొత్తపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వార్తలు అందాయి.