కాకినాడ వైపు నుంచి వస్తున్న కారు, తాళ్లరేవు వైపు నుంచి కోరింగ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై కోరింగ వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో పెదబొడ్డు వెంకటాయపాలేనికి చెందిన ద్విచక్రవాహనదారుడు దండుప్రోలు బాబీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని తాళ్లరేవు సీహెచ్సీకి తరలించారు.