నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు.