నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేశారు. ఫౌండర్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి. హరి సూర్య ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆలయం తిరిగి సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు.