మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు మంత్రి లోకేష్ పర్యవేక్షణలో సుమారు 16,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల చదువులకు అనువైన వాతావరణం కల్పించడంలో మంత్రి లోకేష్ రాజీలేని కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.