భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి వందేమాతర గీతం ప్రేరణదాయకమని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన 150 వసంతాల వందేమాతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రతిధ్వనించిన ఈ గీతాన్ని రచించి నేటికి 150 వసంతాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.