నిడదవోలు పరిధిలోని 33 కేవీ కాటకోటేశ్వరం ఫీడర్ నిర్వహణ పనులు, ట్రీ కటింగ్ కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎన్. నారాయణ అప్పారావు గురువారం తెలిపారు. దీనివల్ల ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కాటకోటేశ్వరం, ఉనకరమిల్లి, కంసాలపాలెం, సూరాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.