ఉండ్రాజవరం: బస్సు ఢీకొని వ్యక్తి మృతి

1చూసినవారు
ఉండ్రాజవరం: బస్సు ఢీకొని వ్యక్తి మృతి
బుధవారం ఉదయం ఉండ్రాజవరం శ్రీరామ హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుట్ల సూర్యనారాయణ (58) అనే వ్యక్తి మృతి చెందాడు. పెరవలి మండలం కానూరుకు చెందిన ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, తణుకు నుంచి రాజమండ్రి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్