కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ఏలేరు ప్రాజెక్టు కింద పక్వానికి వచ్చిన వరి పంట కోతలు డీజిల్ లేక నిలిచిపోయాయి. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యం వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉందని, ఖర్చులు పెరిగి ఆర్థికంగా కష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డీజిల్ సరఫరాను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.