సామర్లకోట పట్టణంలో అక్టోబర్ 5, బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఈఈ ప్రభాకర్ తెలిపారు. 33/11 కేవీ ఉపకేంద్రం పరిధిలోని 11 కేవీ ఈటీసీ ఫీడర్, 11కేవీ సత్యనారాయణపురం ఫీడర్లలో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుంది. జగనన్నకాలనీ, ఏజీఎల్ ఫీల్డ్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.