యు. కొత్తపల్లి మండలం మూలపేటలో సోమవారం దళితులు ధర్నా నిర్వహించారు. 'మొంథా' తుఫాను వల్ల ముంపునకు గురైన బాధితులందరికీ సమానంగా రేషన్ అందించాలని వారు డిమాండ్ చేశారు. కొందరికి 25 కేజీలు, మరికొందరికి 50 కేజీల బియ్యం ఇస్తున్నారని, సమన్యాయం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు.