ఆరు నెలలు నిండగానే శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన తూరంగి సుహాసిని అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ప్రత్తిపాడు సీహెచ్సీకి అంబులెన్స్లో తరలిస్తుండగా దారిలోనే ప్రసవించింది. ఆతర్వాత శిశువుకు స్పందన లేకపోవడంతో ఎస్ఎన్సీయూలో వెంటనే చికిత్స అందించారు. సాధారణ స్థితికి రావడంతో పాటు 800 గ్రాముల బరువుతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.