ఎక్సైజ్ అధికారులు దాడులు.. బెల్లం ఊట ధ్వంసం

3చూసినవారు
ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న కేంద్రంపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 1,000 లీటర్ల బెల్లం ఊటను అధికారులు స్వాధీనం చేసుకుని, సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. నిందితులపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్