గురువారం, తుఫాన్ ప్రభావంతో ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంట పొలాలను సత్యప్రభ పరిశీలించారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా పంట నష్టం ఎదుర్కొన్న రైతులతో, స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.